Monday, October 7, 2019

నన్ను నెంచుకొన నయ్యా నగుఁ బాట్ల నేను

నన్ను నెంచుకొన నయ్యా నగుఁ బాట్ల నేను
కన్నవారి విన్నవారిఁ గాకు సేసేనే IIపల్లవిII

మలసి నా గుణములు మంచివైనప్పుడు గదా
యెలమి నెదిరి నేరము లెంచేది
చెలఁ గి నే పాపములు సేయకుండె మరి గదా
తొలఁ గి పరుల నే దూషించేది IIనన్నుII

నడవడి నే లెస్స నడిచినప్పుడు గదా
పొడవై యన్యులకు నే బుద్ధి చెప్పేది
వెడఁ గై యితరుల నే వేఁ డనియప్పుడు గదా
కడవారి విరక్తి గాదనేది IIనన్నుII

కామినుల సంగమము కాదని నే మరి కదా
నేమమై యితరుల నే నిందించేది
నా మదిలో నన్ను నేను నవ్వుకొని సిగ్గుపడి
నీ మఱఁ గు చొచ్చితి నేఁ డు శ్రీ వేంకటేశIIనన్నుII १५-२०३

ఇది పెదతిరుమలాచార్యుల అధ్యాత్మ సంకీర్తన।
నేను ఎటువంటి వాడనో నన్ను నేను అసహనముతో ఎంచుకొననయ్యా।నన్ను చూసినవారిని విన్నవారిని కాకు(?)చేసేనే।
తిరిగి నా గుణములు మంచివైనపుడు కదా నేను విలాసముతో ఎదుటివారి నేరములెత్తి చూపేది।ఒప్పి నే పాపములు చేయనప్పుడు కదా మరి యితరుల పాపములు గురించి వారిని దూషించగలిగేది।నా నడవడి లెస్సగా నున్నపుడు కదా నేను పెద్దనై యితరులకు బుద్ధి చెప్పగలిగేది।అవివేకినై నేను యితరుల వేడనపుడు కదా నేను సమీపము నందలివారి విరక్తిని కాదనగలిగేది।నేను కామినీ స్త్రీల తో పొందును కాదనినపుడు కదా నియమంతో నేను యితరుల నిందించేది।నా మనసులో నేను నాగుఱించి నవ్వుకొని శ్రీ వేంకటేశా నీ చాటుకు వచ్చాను।--ఈ కీర్తన అందరికీ మార్గదర్శనము చేసేటటువంటిది।ఎవరికి వారు తనను గూర్చి ఇటువంటి విమర్శ చేసుకోవలసి వుంది.

No comments:

Post a Comment