Sunday, October 6, 2019

గద్య పద్యముల డెబ్బది రెండుమంది- యాద్యులచేఁ గొనియాడించుకొన్న

అన్నమాచార్యుని చరిత్రము
అన్నమాచార్య పురందరదాసుల చెల్మి


గద్య పద్యముల డెబ్బది రెండుమంది-
యాద్యులచేఁ గొనియాడించుకొన్న


రసికుండు శ్రీ పండరంగవిఠ్ఠలుఁడు
కొసరెడు భక్తి చేకూరఁ జేసేత-


నెనయ సంధ్యలకు నీళ్ళియ్యఁ జేకొనుచుఁ
దనరు పురందరసాహ్వయుండు


పరమ భాగవతుఁడై పరఁగుచు నంద-
వరకులాగ్రణియైన వైష్ణవోత్తముఁడు


సవరించు మురవైరి సంకీర్తనములు
కువలయంబునఁ బేరుకొన్న మాత్రమున


తలఁచిన భూత బేతాళ పిశాచ-
ములు పాఱిపోవ నిమ్ముల శుభం బెసఁగ


విని కనియును లోన వెఱఁగందికొనుచు
చని , తాళ్ళపాకశాసనుఁ డన్నమయ్య


వెన్నునిఁగానె భావించి కీర్తించి
సన్నుతిసేయ నాచార్యవర్యుండు


నతని విఠ్ఠలునిఁగా ననయంబు దలఁచి
ప్రతిలేని గతుల సంభావించె నపుడు ;-


నీ రీతి మహిమ లనేకముల్ వెలయ
వారక వరభాగవతులు గీర్తింప

No comments:

Post a Comment